అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో అంటేనే అటు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్, అలానే సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉంటాయి అనేది తెలిసిందే. అదీకాక దాదాపుగా అల్లు అర్జున్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంవత్సరం పైగా అవుతుండడంతో, బన్నీ ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. 

 

అల్లు అర్జున్ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో సూపర్ గా దూసుకుపోవడంతో పాటు సినిమా పై కూడా భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడంతో మెజారిటీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ సినిమాపై నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభించినట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో చాలా సీన్స్ త్రివిక్రమ్ గత సినిమాలలోని సీన్స్ ని గుర్తు చేస్తాయి. ఇక కథనం కూడా అంత వేగంగా లేకుండా స్లోగా ఉండడం వలన కొన్ని సార్లు బోరింగ్ అనిపిస్తుంది. 

 

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అసలు కథలోకి వెళ్ళకపోవడం వలన స్లో అనిపిస్తుంది. దానికి తోడు మూవీ లెంగ్త్ కూడా సమస్య అయ్యింది. బన్నీ సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో పూజ హెగ్డే క్యారెక్టర్ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇక మధ్యలో అక్కడక్కడా పేలే త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కూడా ఆకట్టుకున్నాయని, రెండు సాంగ్స్ తో పాటు కీలక సీన్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ వంటివి సినిమాలో బాగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే తాము ఆశించిన రేంజ్ లో మాత్రం సినిమా లేదని, ఓవర్ ఆల్ గా సినిమా యావరేజ్ అని చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: