అల్లు అర్జున్ నేషనల్ సెలెబ్రెటీగా మారాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కుదిరితే భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీలో నటించాలని కలలు కంటున్న బన్నీ ‘అల  వైకుంఠపురములో’ మూవీ విడుదల సందర్భంగా జాతీయ మీడియాకు కూడ విపరీతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

లేటెస్ట్ గా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీకి ఒక అనుకోని ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చే మూడు పేర్లు ఆలోచించకుండా వెంటనే చెప్పమని అడిగినప్పుడు బన్నీ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. 

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే మూడు పేర్లు సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవి ప్రభాస్ మాత్రమే అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. అంతేకాదు చరిత్రలో ఈ ముగ్గురు మాత్రమే నిలిచిపోతారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత చిరంజీవి చరిత్రలో నిలిచిపోయే స్థానం అని బన్నీ చెప్పడంలో ఎవరికీ ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకపోయినా కేవలం ఒక్క ‘బాహుబలి’ ని దృష్టిలో పెట్టుకుని బన్నీ ప్రభాస్ కు ఎన్టీఆర్ చిరంజీవిల పక్కన స్థానం ఎలా కల్పించాడు అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. 

మరికొందరైతే బన్నీ చేసిన ఈ కామెంట్స్ తో టాప్ హీరోల అభిమానులకు అసహనం ఏర్పడి మళ్ళీ బన్నీని టార్గెట్ చేస్తారు అంటూ ఊహాగానాలు కూడ చేస్తున్నారు. వాస్తవానికి ‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ స్టార్ సెలెబ్రెటీగా మారిపోయినా సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవిల స్థాయిలో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగే లాంగ్ ఇన్నింగ్స్ ప్రభాస్ కు ఉంటుందా అన్న సందేహాలతో కొందరు బన్నీ అభిప్రాయాలను తప్పు పడుతూ అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టేసారు. దీనితో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ టైమ్ లో బన్నీ ఎందుకు ఎంచుకున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: