ఎప్పుడెప్పుడా అని ఎదురచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కు ఈరోజు పండగే అని చెప్పాలి.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబనేషన్లో వచ్చిన సినిమా అల వైకుంఠపురం లో.. పూజ హెగ్డే కథానాయికగా.. నటించగా, టబు, జయరాం, పోసాని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు..ఈ సినిమా భారీ అంచనాలతోప్రేక్షకుల ముందుకు వచ్చింది..

 

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు.. అందుకే ఈసినిమాలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. మొత్తానికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ నుకట్టిపడేస్థింది .. ఎప్పుడు ఒకటే సెంటి మెంట్ కాకుండా సినిమా లైన్ లో కాస్త ప్రేమను పెంచాడు.. దానితో సినిమా బాగా హిట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి..చూడాలి మరి ఈ మాత్రం వెళుతుందో అని..

 

త‌న ఇల్లు అల వైకుంఠ‌పురం అని తెలిశాక బ‌న్నీ తొలిసారి ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అది బ‌న్నీ పెంపుడు తండ్రి ముర‌ళీశ‌ర్మ‌కు ఇస్టం ఉండ‌దు. లోప‌ల ఉన్న స‌చిన్ కేద్క‌ర్ నీకు అక్క‌డ ఎంత ఇస్తున్నారు అంటే రు.25 వేలు క‌టింగులు పోను ఇర‌వై చేతికి వ‌స్తుంద‌ని చెపుతాడు ప‌క్క‌నే ఉన్న ముర‌ళీశ‌ర్మ అడుగ‌డుగునా బ‌న్నీని అక్క‌డ చేర‌కుండా చూస్తుంటాడు స‌చిన్ కేద్క‌ర్ నీకు న‌చ్చిన రూంలో కంప్యూట‌ర్ పెట్టుకుని ఉండూ అంటే ముర‌ళీశ‌ర్మ కంప్యూట‌ర్ పెట్టుకుని ఏం చేస్తాడు అన‌డంతో అమ్మాయిల బోమ్మ‌లు చూస్తాడు నీ కెందుకు అన‌డంతో న‌వ్వులే న‌వ్వులు అని ఆయన అభిమానులు అంటున్నారు.. 

 

అందుకే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకునేలా ఉందని అందరూ అనుకుంటున్నారు.. మొత్తానికి సినిమా హిట్ అయిందని జనాలే చెప్తున్నారు.. మొత్తానికి ఇన్ని రోజులకు ఈ సినిమా హిట్ అయిందని చెప్పాలి.. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండుగను ఒకరోజు ముందే జరుపుకుంటున్నారు.. ఈ సినిమా హిట్ తో బన్నీ మళ్లీ ఫాంలోకి వచ్చాడు..నెక్స్ట్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: