సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో  రూపొందిన చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. లేడి అమితాబ్ విజయ శాంతి , ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించారు. తాజాగా విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్న  విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లుగానే ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ బొమ్మ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేశారు.

 

ఇకపోతే ప్రతి సినిమాలో రొమాన్స్ కు కేరాఫ్ గా ఉన్న మహేష్ కు ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునేలా సీన్లు లేవని టాక్ వినపడుతుంది.. మిలటరీ వ్యక్తి పాత్రలో నటించిన మహేష్ ను చూస్తే మహర్షి, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు.మహేష్ అన్నీ సినిమాలను కలబోసి ఈ సినిమా మీద ఎఫోర్ట్ పెట్టిన పెద్దగా కలిసిరాలేదు.. దీంతో సినిమాకు గడ్డుకాలం ఏర్పడింది..


 ఈ సినిమాకు భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే సినిమాలో హీరో హీరోయిన్లు మద్య సాగే సన్నవేశాలు సినిమాను హిట్ టాక్ ను అందుకునేలా లేదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.. సినీ వర్గాల విషయానికొస్తే.. సినిమా రొటీన్ కథనే తీశారు..మహేష్ సినిమాలో ఉన్న జోష్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.. అనిల్ జిమ్మిక్కులు కేవలం ఫస్ట్ ఆఫ్ కే సెట్ అయ్యాయని అంటున్నారు.. సెకండ్ ఆఫ్ సాగదీయడం ఈ సినిమా కలెక్షన్లు గండి పడిందని టాక్..

 


సినిమా తొలిరోజే యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద సినిమా మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం దాదాపు 252 చోట్ల విడుదలైంది. ‘నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అన్నట్లు..ఇది ఇలా ఉండగా కేవలం ప్రీమియర్ షో లకే రెండు రాష్ట్రాల్లో 8 కోట్లకు పైగా రాబట్టిందట. దీంతో ఈ సినిమా సంక్రాంతికి వంద కోట్ల క్లబ్ లోకి చేరేలా ఉందని  సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ వంశి పైడి పల్లి దర్శకత్వం రూపొందుతున్న సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: