సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడం తో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అందులో భాగంగా నైజాం లో తొలి రోజు 8.66కోట్ల షేర్ ను రాబట్టగా గుంటూరు లో 5.15కోట్ల షేర్ తో నాన్
బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది అలాగే ఉత్తరాంధ్ర లో 4.55కోట్ల షేర్ ను ,
కృష్ణా లో 3.07కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఓవరాల్ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 45కోట్ల గ్రాస్ ను 33కోట్ల షేర్ వసూళ్ల ను రాబట్టి
మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.
ఇక అటు ఓవర్సీస్ లో కూడా సరిలేరు సత్తా చాటుతుంది. ఇప్పటివరకు అక్కడ ఈ చిత్రం1.24మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. కాగా మొదటి రోజే ఈచిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో 42 శాతానికి పైగా రికవరీ చేసింది. టికెట్ల రేట్లు పెంచడం అలాగే ఎక్స్ట్రా షోస్ కూడా తోడు కావడంతో ఈభారీ వసూళ్లు సాధ్యమయ్యాయి.
అయితే ఈ చిత్రానికి ఈ రోజు నుండి భారీ పోటీ ఎదురుకానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల .. వైకుంఠపురములో.. భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైయింది. ప్రీమియర్స్ , అలాగే ఎర్లీమార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అల కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. దానికి తోడు సగం థియేటర్లు ఈ సినిమా ఆక్రమించుకుంది దాంతో సరిలేరు నీకెవ్వరు రెండో రోజు కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించనుంది.