స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో  తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల... వైకుంఠపురములో...  ఈరోజు భారీ అంచనాల మధ్య  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది.  ప్రీమియర్స్ , ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. స్టోరీ లో కొత్త ధనం లేకున్నా .. త్రివిక్రమ్ డైలాగ్స్ , బన్నీ నటన , డ్యాన్స్ ,సాంగ్స్ , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సినిమా ను కాపాడాయి. ఇక ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం కాగా  అనూహ్యంగా  ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతుంది.
 
 
ముఖ్యంగా ఆస్ట్రేలియా లో ఈచిత్రం అదరగొడుతుంది.  ఇప్పటివరకు ఈ చిత్రం అక్కడ 211,428 డాలర్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం.దాంతో  మొదటి రోజు  ఈ చిత్రం అక్కడ నాన్ బాహుబలి రికార్డు ను సృష్టించేలా వుంది. ఇక ఓవర్సీస్ లో ఈచిత్రం ప్రీమియర్స్ కలుపుకొని ఇప్పటివరకు  $700k వసూళ్లను రాబట్టింది.  ఈ చిత్రం తో అక్కడ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనున్నాడు. 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం , మురళి శర్మ , సునీల్ , హర్ష వర్ధన్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు .  గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా  నిర్మించారు.  ఇక  బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా దాంతో  వారిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇంతకుముందు వీరి  కలయికలో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  అయ్యాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: