అందాల ఆరబోత ఒక వెండితెరపైనే హీరోయిన్‌లు మాత్రమే చేస్తారనుకుంటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ మద్య కాలంలో తెలుగు బుల్లితెరపై అందాలను ఆరబోస్తున్న హాట్ యాంకర్లు ఉన్నారు. అందులో చెప్పుకోవలసిన పేరు అనసూయ భరద్వాజ్ ఒకరు.

 

 

ఈమె అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై కూడా కనిపిస్తూ సినీ ప్రేక్షకులను ఆలరిస్తోంది.  ఆ మధ్య రామ్ చరణ్సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మంచి పాత్రను పోషించింది. అంతకు ముందు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో హీరోకు మరదలుగా నటించింది. ఇదే కాకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తు కుర్రకారును ఊపేస్తోంది.

 

 

ఇకపోతే ఇప్పటికే ఈమె జబర్దస్త్ వంటి ప్రముఖ కామెడీ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరో పక్క సినిమాల్లో కూడా అడపదడప పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గత కొద్దికాలంగా అనసూయ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెర కే పరిమితం అయింది.

 

 

అందచందాలలో కథానాయకులకు ఏ మాత్రం తీసుకొని అనసూయ తన ఫోటో షూట్ లతో తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటోంది. అంతే కాకుండా తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి 152 చిత్రంలో మొదటగా ఈ అమ్మడిని ప్రాధాన్యత ఉన్నటువంటి ఓ ప్రత్యేక పాత్రలో తీసుకున్నారని సమాచారం.

 

 

ఇదిలా ఉండగా తెరవెనక ఏం జరిగిందో తెలియదు కానీ కొద్దిరోజుల తర్వాత ఈమెని పక్కన పెట్టి, ఓ ప్రముఖ సీనియర్ హీరోయిన్ ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న అనసూయాకి ఇది కొంతమేర నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: