అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు రేపుతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ ఈ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లారు అని వేరేలా చెప్పనక్కర్లేదు..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి పాటలన్నీ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి..
విషయానికొస్తే.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.. రాములో రాములో, బుట్ట బొమ్మ., సామజవరగమన ఈ మూడు పాటల విడుదలయ్యి ప్రభంజనాన్ని సృంష్టించిన సంగతి తెలియసిందే.. ఇకపోతే సామజవరగమన పాట మాత్రం సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
ఇది ఇలా ఉండగా ఈ ఈ పాటను ఓ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో పేరడీ చేసి ఆకట్టుకున్నారు.. ‘నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు.. సమయమంతా వృథా చేస్తే ఉండదురా ఫ్యూచరూ.. నీ మనసు గాలి ఊయ్యాలలూగుతూ ఉంటే చెడిపోతావ్.. నీ ధ్యాసను చదువులో పెడితే మంచోడివి అవుతావ్..’అంటూ పాడిన ఈ పాట అందరిని ఆకట్టుకోవడంతో అతనిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్ వేసుకోండి..