టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గానటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు ఈరోజు విడుదలయింది. ఇప్పటీవరకు ఈ సినిమా నుండి వచ్చిన అన్నీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయి వేరేలా చెప్పనక్కర్లేదు. 

 

అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు  సూపర్ హిట్ అయ్యాయి.  దీంతో ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి పాటలన్నీ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి.

 

సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమా హిట్ అందుకుంటూనే వస్తుంది.ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా బన్నీ హిట్ అయిందని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ చిత్రం ఊరటనిచ్చింది. సినిమా కు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టేలా ఉంది. 

 


మొత్తానికి సినిమాలోని ఫ్యామిలీ సన్నివేశాలు, సాంగ్స్, సినిమాలోని లొకేషన్స్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని అదనపు సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి.ఏది ఏమైనా హిట్ కోసం ఎదురు చూస్తున్న బన్నీకి ఈ సినిమా మంచి హిట్ ని అందించింది. ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ మరో సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ అంటే హిట్ పక్క అని అభిమానులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: