నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అల్లు అర్జున్ సినీ లైఫ్ లో అతిపెద్ద డిజాస్టర్ గా మారడంతో తదుపరి సినిమాల కథల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు పాటించి మరి అల  వైకుంఠపురములో సినిమాలో నటించారు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటించింది.సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయింది.
 

అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు  సూపర్ హిట్ అయ్యాయి.  దీంతో ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి పాటలన్నీ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి.

 

విషయానికొస్తే.. ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్లు ,టీజర్లు, ట్రైలర్స్ మరియు సాంగ్స్ ఈ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా నుండి వచ్చిన పాటలన్నీ ఈ సినిమా పై ప్రేక్షకుల అభిప్రాయాన్ని పెంచాయి. అయితే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా హిట్ అయిందనే మాటలు వినపడుతున్నాయి. కొత్త బన్నీ ని చూస్తున్నామని అభిమానులు సంతోశాన్ని వ్యకతం చేస్తున్నారు. 

 

ఈ సినిమాలోని ఫ్యామిలీ సన్నివేశాలు, సాంగ్స్, సినిమాలోని లొకేషన్స్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని అదనపు సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి.ఏది ఏమైనా హిట్ కోసం ఎదురు చూస్తున్న బన్నీకి ఈ సినిమా మంచి హిట్ ని అందించింది. ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ మరో సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ అంటే హిట్ పక్క అని అభిమానులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: