టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠ పురములో. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ పాటలు రికార్డు సృష్టించగా..సినిమా కూడా  నేడు  విడుదలై రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులై సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి  బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు మూడో సినిమాగా  వచ్చిన అల వైకుంఠపురములో  సినిమా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్క అని చెబుతున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోయింది అంటున్నారు ప్రేక్షకులు. 

 

 

 ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తమ  అభిమాన హీరో సినిమా బ్లాక్ బస్టర్  టాక్ తెచ్చుకోవడంతో ఆనందంలో మునిగి పోయి సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి భారీగా పోటీ ఉన్నప్పటికీ అల వైకుంఠ పురములో సినిమా మొత్తం మంచి గ్రాండ్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. సినిమాలు ప్రతి అంశం ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. అయితే సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న అల వైకుంఠ పురములో  సినిమా పై... ఏపీ మాజీమంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు.అల  వైకుంఠపురములో  సినిమా హీరో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ మాజీమంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

 అల వైకుంఠపురములో చిత్ర బృందం మొత్తానికి శుభాభివందనాలు అంటూ తెలిపారు గంటా శ్రీనివాస్. అల వైకుంఠ పురములో చిత్ర బృందం అద్వితీయమైన విజయం  నమోదు చేసింది అని పేర్కొన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మరోవైపు అల  వైకుంఠపురములో సినిమా  హీరో అల్లు అర్జున్ కూడా తన సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి అంటూ ట్విట్టర్లో స్పందించారు అల్లు అర్జున్. ఈ సినిమాను విజయం  చేసిన అందరికీ థాంక్యూ థాంక్యూ అంటూ సంతోషం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. 

మరింత సమాచారం తెలుసుకోండి: