టాలీవుడ్కు సంక్రాంతి సీజన్ చాలా పెద్ద మార్కెట్. ఈ సీజన్లో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కలెక్షన్లకు డోకా ఉండదని భావిస్తారు. అయితే ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలతో పాటు రెండు మీడియం రేంజ్ సినిమాలు ఈ సీజన్లో బరిలో దిగుతున్నాయి. వీటిలో ఏ సినిమా నిలబడుతుంది. ఏ సినిమా గెలుస్తుంది..? అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లోనూ నెలకొఇంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు సంక్రాంతి బరిలో తలపడేందుకు కాలు దువుకున్నారు. ఇక అనుకున్నట్టుగానే ఈ రెండు సినిమాలు విడులవడంతో అటు ఇండస్ట్రీ వర్గాలో.. ఇటు ప్రేక్షకుల్లో సగం ఉత్కంఠకు తెర పడింది.
మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు.. ఆ మరుసటి రోజే అంటే 12న విడుదలైన అల వైకుంఠపురములో రెండు సినిమాలకు హిట్ టాక్ దక్కించుకున్నారు. దీంతో చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ ఒకవైపు ఫ్యాన్స్.. మరోవైపు చిత్రయూనిట్ జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరిలేరు చిత్రయూటిన్ ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ పేరుతో ఒక ప్రోమోను విడుదల చేశారు.
ఇందులో అయ్యబాబోయ్ ప్రసాద్ గారు.. బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చేశాడు. ఒక 3, 3.5 దాకా ఇచ్చేశాడండి’’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఉంటుంది. మరోవైపు అల చిత్రయూనిట్ కూడా `అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్` అంటూ ఓ ప్రోమో విడుదల చేసిందండోయ్. ఇందులో.. స్టైలిష్ స్టార్ స్టైలిష్ ఫైట్తో ఈ ప్రోమోను కట్ చేశారు. అయితే ప్రోమో చివరిలో `బాబోయ్.. ఈడు ఉత్త మొగుడు కాదు, రంకు మొగుడు` అని సునీల్ చెప్పే డైలాగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సరిలేరులో ప్రకాష్రాజ్ మహేష్బాబును మొగుడుగా భావించాడు. అయితే బన్నీ మొగుడు కన్నా ఇంకా పైస్థాయిలో చూపించాలని రంకు మొగుడిని చేసేశారంటూ అభిప్రాయపడుతున్నారు.