చలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. నాగ శౌర్య సరసన ఆ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక, తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తరువాత యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాలో నటించి మరొక సూపర్ హిట్ కొట్టిన రష్మిక, ఆ తరువాత మరొక్కసారి విజయ్ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించింది. 

 

అనంతరం ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన సరిలిరు నీకెవ్వరు, అల్లు అర్జున్, సుకుమార్మూవీ తో పాటు నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా యావరేజ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇకపోతే ఆ సినిమా టీమ్ నేడు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ షోలో ఆమెతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటి సంగీత కూడా పాల్గొన్నారు. ఈ షో వీడియో ప్రోమోని నేడు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ షోలో భాగంగా వ్యాఖ్యాత ఓంకార్ ఒక సందర్భంలో రష్మిక తలపై గన్ గురి పెడతాడు. దానికి ఒక్కసారిగా రష్మిక స్టన్ అవుతుంది. 

 

ఇంత అందమైన అమ్మాయిని చూస్తుంటే ఎందుకో కాల్చాలనిపించడం లేదు అని ఓంకార్ అనగానే, సంగీత అబ్బాబ్బబ్బా మీలాంటి మంచి యాంకర్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ డైలాగ్ వేయడంతో షో మొత్తం నవ్వులు పూస్తుంది ఇక ఆ వీడియోలో దేవిశ్రీప్రసాద్ మైండ్ బ్లాక్ సాంగ్ ని పాడుతూ డాన్స్ వేస్తాడు. ఇక ప్రస్తుతం ఆ వీడియో ప్రోమో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుండగా, పలువురు నెటిజన్లు దానిని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: