స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథానాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములులో. అలాంటి సూపర్ కాంబినేషన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. 

 

సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు సినీ ప్రేక్షకులు అంత.. అయితే సినిమాట్రైలర్, టీజర్ చూసి ఏది కూడా అన్ని సినిమాలు కలిసి కాపీ పేస్ట్ అయ్యి ఉంటుందిలే అనుకున్నారు అంత.. కానీ ఆలా లేదు.. సినిమాలో మొదలైన సీన్ నుండి చివరి సీన్ వరుకు అంత అరుపులే..              

 

ప్రేక్షకులు అంత సూపర్ సూపర్ అని చెప్తుంటే.. నేను అల్లు అభినినే అవ్వడం వల్ల సినిమాపై ఓ రేంజ్ లో ఊహాగానాలు పెట్టుకొని థియేటర్ లోకి అడుగుపెట్టా. అడుగుపెట్టినప్పటి నుండి అభిమానుల నుండి ఈలలు.. కేకలు. థియేటర్ దద్దరిల్లింది అనుకోండి.. ఈ సినిమా కారణంగా మాస్ థియేటర్స్ ఏ కాదు.. క్లాస్ థియేటర్స్ లో కూడా అభిమానులు కేకలు వెయ్యడం... రచ్చ రచ్చ చెయ్యడం మొదలెట్టారు. సినిమా అంత అద్భుతంగా ఉంది అనుకోండి.                    

 

ఇంకా అద్భుత సినిమాలో ముఖ్య పాత్రలలో మురళి శర్మ.. ఎన్నో ఏళ్లతరవాత ఈ సినిమా కోసం ఎంట్రీ ఇచ్చిన టబు, జైరాం అలాగే సుషాంత్, నివేత పేతురాజ్ వంటి నటులు నటన అదిరిపోయింది. సినిమాను చుసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా అనకుండా ఉండలేకపోతున్నారు.. అంతే కాదు.. ఎప్పుడు ప్రతి సినిమాకు నెగటివ్ రివ్యూ ఇచ్చే పత్రికలు కూడా ఈరోజు అంత పాజిటివ్ రివ్యూ ఇచ్చాయి అంటే సినిమా ఎంత గొప్పగా ఉందొ ఊహించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: