టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టబు, సునీల్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, సుశాంత్, నవదీప్, నివేత పేతురాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఎంతో పెద్ద సక్సెస్ సాధించాయి. ఇకపోతే నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించుకుంది. 

 

మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను యాక్షన్, ఎంటర్టైన్మెంట్, స్టైలిష్ డైలాగ్స్ జోడించి దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటించిన ఈ సినిమాలో ఆయన తండ్రిగా మురళి శర్మ నటించగా, పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో అలవైకుంఠపురములో యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఈ సినిమాని తన భార్య స్నేహ రెడ్డితో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఒక ప్రముఖ థియేటర్ లో వీక్షించడం జరిగింది. అసలే రిలీజ్ రోజు, అందునా హీరో బన్నీ కూడా సినిమా చూడడానికి వస్తుండడంతో ఆ థియేటర్ వద్ద ఫ్యాన్స్ తాకిడి మరింత పెరగడంతో ఆ ప్రాంతం అంతా మంచి కోలాహలంగా మారింది. 

 

ఇక బన్నీ హాల్ లో సినిమా చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ చేసిన గోల అంతా ఇంతా కాదని తెలుస్తోంది. అయితే సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బన్నీ, తనకు ఈ విధంగా ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడం అంటే ఎంతో ఇష్టం అని, వారి అభిమానం ఏమి ఇచ్చినా, ఎంత చేసినా వెలకట్టలేనిదని, అలానే తమ సినిమాని మంచి హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: