బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ . ఈ హీరోకి బాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువ హీరోల అందరిలో షాహిద్ కపూర్  కు ఉండే క్రిస్ ఒకెత్తు. షాహిద్ కపూర్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని బాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తారు.   ప్రయోగాత్మక సినిమాల్లో నటించడం  షాహిద్ కపూర్ కే  సొంతమని చెప్పాలి. వైవిద్యాత్మకమైన  పాత్రల్లో  నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరో  షాహిద్ కపూర్. ఇక రీసెంట్ గా తెలుగులో సెన్సేషనల్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్  సినిమా అయినా కబీర్ సింగ్ లో నటించి తన సత్తా చాటాడు. రియలిస్టిక్  నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు షాహిద్ కపూర్. 

 

 

 ఇక షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ సినిమా భారీ వసూళ్లు కాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగు రీమేక్ సినిమాలపై బాగా దృష్టి పెట్టాడు షాహిద్ కపూర్. అర్జున్ రెడ్డి రీమేక్  సూపర్ హిట్ అవ్వడంతో మరో తెలుగు సినిమాను రీమేక్  చేయడానికి సిద్ధమై పోయాడు. ప్రతి సినిమాలో తన రియలిస్టిక్  నటనతో ప్రేక్షకులను అలరిస్తారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కబీర్సింగ్ తో  తన అద్భుతమైన నటనతో అదరగొట్టిన షాహిద్ కపూర్... మరో తెలుగు సినిమా జెర్సీ మూవీ రీమేక్ చేయడానికి సిద్ధమై పోయాడు. 

 

 

 తెలుగులో నాని హీరోగా నటించిన క్రికెట్ నేపథ్యంలో సాగే జెర్సీ సినిమా హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించనున్నాడు. దీనికోసం క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు షాహిద్ కపూర్. అయితే గత కొన్ని రోజుల క్రితం షాహిద్ కపూర్ పెదాలకు గాయాలైన విషయం తెలిసిందే.  ఏకంగా  13 కుట్లు  పడినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా షాహిద్ కపూర్ ముఖానికి మాస్క్  వేసుకుని ముంబై ఎయిర్ పోర్టు కనిపించాడు షాహిద్ కపూర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన షాహిద్ కపూర్ ... మీ  ప్రేమకు ధన్యవాదాలు అవును నిజంగానే నాకు గాయాలయ్యాయి.. కుట్లు కూడా పడ్డాయి ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకున్న.. జెర్సీ సినిమా నా రక్తం తీసుకుంది అంటూ ట్వీట్ చేసాడు షాహిద్కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: