స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే.. మాటల్లో చెప్పలేనిది. 

 

ఇంకా విషయానికి వస్తే సినిమాలో అన్ని రకాల ఎమోషన్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ.. కోపం.. కామెడీ.. పాటలు.. ఫైట్లు.. ఫ్యామిలీ జోకులు.. యాక్షన్ సీన్లు అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అలానే సినిమాలో నటించిన వాళ్ళు కూడా ఓ రేంజ్ లో ఉన్నారు.. తాబూ, నివేత పేతురాజు.. సుశాంత్.. తండ్రి పాత్రలో మురళి శర్మ అద్భుతం..  ఇంకా ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా అద్భుతంగా చేసారు. 

 

స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా ఉన్నంత‌లో బాగానే చేశాడు... త‌మిళ్ డైరెక్ట‌ర్ ఇక తెలుగులోనూ విల‌న్ వేషాలు వ‌చ్చే ఛాన్స్‌. కథానుగుణంగా సెటిల్డ్‌ విలనిజం ప్రదర్శించాడు. స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాలో కాకినాడలో ఉండే అప్పలనాయుడు పాత్ర‌లో న‌టించాడు. అత‌డు పోర్ట్ ద‌గ్గ‌ర వ్యాపారం చేస్తూ ట‌బూ, జ‌యరం కంపెనీలో వాటా కావాల‌ని బెదిరిస్తాడు. 

 

స‌ముద్ర‌ఖ‌ని ఎంట్రీతో కథ కొంచెం సీరియస్‌ టర్న్‌ తీసుకుంటుంది. స‌ముద్ర‌ఖ‌ని మూతి ప‌క్క‌కు పెట్టి చెప్పే డైలాగులు వాటికి బ‌న్నీ కూడా అలాగే మూతి పెట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డం బాగుంది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులోనూ స‌ముద్ర‌ఖ‌నికి విల‌న్ ఛాన్సులు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 

మరి ఈ డైరెక్టర్ వెళ్తాడా లేదా అనేది చూడాలి .. ఏది ఏమైనా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది ఈ సినిమా. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఎన్నో రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ ఇచ్చి సంక్రాంతికి ఆనందాన్ని ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: