సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సంక్రాతి కానుకగా 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ అలాగే ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు 13 ఏళ్ళ తర్వాత లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక అద్భుతమైన పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేశారు. 

 

ఇక మహేష్ పైకి క్లాస్ హీరోగా కనిపిస్తున్నప్పటికి పోకిరి, బిజినెస్ మాన్ వంటి సినిమాలతో మహేష్ ఫ్యాన్ లోనే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన మాస్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు. అసలు మహేష్ లో ఈ రేంజ్ మాసిజం ఉందా అన్న విషయం పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలతో అర్థమైంది. ఇక కొరటాల శివతో కలిసి మహేష్ బాబు సామాజిక అంశాలు ఉన్న సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను ఆ తరహాలో తెరకెక్కి సూపర్ హిట్స్ ని అందుకున్నవే. ఇక మహేష్ దూకుడు వంటి పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో బాక్సాఫీస్ దగ్గర చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకే మహేష్ యూనివర్సల్ హీరో అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటుంది. ఇక మహర్షి తర్వాత కంప్లీట్ ఎంటర్‌టైనర్ తో రావాలని ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడితో జత కట్టాడు. 

 

అందుకు కారణం అనిల్ కి మంచి కామెడీ టైమింగ్ తో పాటు హీరోని ఎలివేట్ చేసే టాలెంట్ బాగా ఉంది. ఇక ఫ్యామిలీ పరంగా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్స్ ని బాగా పండించగలిగే ఆడియన్స్ పల్స్ కూడా బాగా పట్టుకున్నాడు. ఇవన్ని సరిలేరులో బాగా కలిపి కొట్టాడు. అయితే ఈ సారి అనిల్ రావిపూడి ఫన్ ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ అంతా కామెడి తో సెకండాఫ్ అంతా ఎమోషన్స్ తో సాగదీశాడని ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఇక భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అసలు మహేష్ కి చెప్పింది ఒకటి అనిల్ తీసింది ఒకటి అని ఇపుడు టాక్ మొదలైంది. అంతేకాదు ఈ సినిమా రిజల్ట్ చూసి మహేష్ కూడా అనిల్ తో 'నువ్వు నాకు చెప్పింది ఏంటీ .. తీసింది ఏంటీ అని బుద్దుండక్కర్లా' ..అంటూ సీరియస్సాయ్యాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అంతేకాదు అసలు మహేష్ బాబు అనిల్ ఇలాంటి సినిమా ఎలా తీశారని, అసలు మహేష్ జడ్జిమెంట్ ఎప్పుడు తప్పవదు కదా ..ఏం జరిగిందని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: