పటాస్ నుండి ఎఫ్2 వరకు మధ్యలో ఒక్క ఫ్లాప్ కూడా పడకుండా వరుసగా హిట్స్ ని అందుకొని సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా భారీ స్థాయిలో ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫస్ట్ షో నుండే యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ఈ సినిమాకి బాగా హైప్ తీసుకు వచ్చినప్పటికి స్వయంగా మహేష్ బాబు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాని బాగా ప్రమోట చేశాడు. కానీ అదంతా వృధానే అంటున్నారు ప్రేక్షకులు. 

 

గత రెండేళ్ళుగా సీరియస్ గా ఉండే సినిమాలు చేసిన మహేష్ 'శ్రీమంతుడు'.. 'భరత్ అనే నేను'.. 'మహర్షి' ఇలా అన్నీ సినిమాలు సామాజిక అంశంతో బలమైన కథ ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అందుకే ఈ సారి వీటన్నిటికి భిన్నంగా పోకిరి, 'దూకుడు' వంటి ఒక మాస్ ఎంటర్టైనర్ని.. ఈ ట్రెండ్ కు తగ్గట్టు చెయ్యాలనే ఆలోచనతో సరిలేరుకి సైన్ చేశాడు. 'మహర్షి' షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి సరిగ్గా అలాంటి కథే చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూస్తారని చిత్ర యూనిట్  ముందునుంచి చెప్తున్నట్టుగానే సూపర్ స్టార్ చాలా కొత్తగా ఉన్నాడు. 

 

అయితే భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది కాస్తా యావరేజ్ అంటూ మారిపోయింది. అసలు మహేష్ నుండి ప్రేక్షకులు ఆశించిన అంశాలు ఏవీ లేవని డిసప్పాయింట్ అయ్యారు. ఒక్కొక్కటిగా ఈ సినిమాలో ఉన్న మైనస్ లని ఎత్తి చూపిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన్న గురించే ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా రష్మిక సరిలేరుకి కంప్లీట్ మైనస్ అని అంటున్నారు. తన పిచ్చి చేష్టలతో మహేష్ కే పిచ్చెక్కించిందని తన ఓవర్ యాక్షన్, అనవసరమైన స్కిన్ షో సినిమాకి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. మహేష్ గత సినిమాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలలో హీరోయిన్స్ తో రష్మిక ని కంపేర్ చూస్తే నిజమేననిపిస్తుంది. మొత్తానికి మహేష్ స్టార్ డం మొత్తం రష్మిక దెబ్బతీసిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: