టాలీవుడ్ లో అవార్డుల పండగల గురించి తెలిసిందే. స్టార్ మా, జెమిని, జీ ఛానళ్ళు ప్రతి ఏడాది అవార్డ్స్ ని అందిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమం టాలీవుడ్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా 2020 అవార్డుల వేడుక కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కళా తపస్వి కె. విశ్వనాథ్-  మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా వేడుక ఘనంగా జరిగింది. ఇంకా పూరి జగన్నాథ్- ఎనర్జిటిక్ స్టార్ రామ్- చార్మీ- సమంత అక్కినేని- పూజాహెగ్దే- నిధి అగర్వాల్- సుష్మిత కొణిదెల- శ్రద్ధా శ్రీనాథ్- నీల్ నితిన్ ముఖేష్ ల తో పాటు ఇంకా టాలీవుడ్ కి చెందిన తదిరులు వేడుకలో పాల్గొన్నారు.

 

2019 ఉత్తమ నటిగా అక్కినేని కోడలు సమంత అవార్డును అందుకున్నారు. మజిలి..ఓ బేబి సినిమాల్లో సమంత అక్కినేని పెర్పామెన్స్ కి గాను ఈ అవార్డు దక్కింది. అవార్డుల వేదికపై డిజైనర్ డ్రెస్ లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. చిరు పాత పాటలతో వేదిక షేకైంది. ఆ పాటలకు యవ హీరో కార్తీకేయ డాన్సు లు చేసి మెగాస్టార్ మనసును గెలిచాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరాని భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కి దాదాపు దశాబ్దం నాటి కలని నెరవేర్చడానికే చరణ్ ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు ఆ సినిమాలోని నరసింహా రెడ్డి పాత్రకిగాను మెగాస్టార్ కి ఉత్తమనటుడిగా అవార్డ్ రావడం గొప్ప విషయం. 

 

ఇక ఉత్తమ దర్శకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (ఇస్మార్ట్ శంకర్) అవార్డును అందుకున్నారు. ఉత్తమ నిర్మాతగా ఛార్మీ.. ఉత్తమ సంచలన హీరోగా రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి అవార్డులు అందుకున్నారు. ఇంకా పలు విభాగాల్లో ఇస్మార్ట్ శంకర్ కు అవార్డులు దక్కాయి. ఇంకా వివిధ విభాగాల్లో జీ అవార్డులతో దర్శక నిర్మాత హీరోలను సత్కరించింది. ఇక అత్యధిక అవార్డులు అందుకుంది పూరి ఇస్మార్ట్ శంకర్ కావడం మరో విశేషం. ఇక పూరి తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ విజయ్ కి జోడీగా నటిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: