ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న అదృష్టం చాలా బాగుంది. ఆమె చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూ పోతుంది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస పెట్టి సినిమాలు చేస్తూ మంచి హిట్లు సాధిస్తుంది. ఆమె చేసిన దేవదాస్, డియర్ కామ్రేడ్ మినహా అన్ని చిత్రాలు హిట్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగా కెరీర్ ఆరంభంలో ఏ సినిమా వచ్చినా ఒప్పేసుకుంటారు.

 

ఆ సినిమాలో నటనకి స్కోప్ ఉందా.. లేదా అని చూసుకోరు. కానీ రష్మిక తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించింది. కెరీర్ ఆరంభంలోనే అలాంటి పాత్రలు పడటం ఆమె అదృష్టం. అయితే ఇటీవల రిలీజైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం ఆమె పాత్ర తేలిపోయింది. మాటి మాటికీ హీరో వెంటపడి కౌగిలించుకునే పాత్రలో ఆమె నటించడం నెటిజన్లకి ఏమాత్రం నచ్చలేదు.

 

ఈ నేపథ్యంలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ కి  కారణం వేరే ఉంది. గీత గోవిందం' ప్రమోషన్ల టైంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ . నాలుగు పాటల కోసం వచ్చి పోయే పాత్రలు చేస్తే ఏం లాభం.. అలాంటి పాత్రలు నేను చేయను అంటూ మాట్లాడిందామె. ఐతే పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ వెంటనే అందుకుని సీరియస్‌గా.. రేప్పొద్దున ఎప్పుడైనా నాలుగు పాటలున్న సినిమా చేయి అప్పుడు గట్టిగా తగులుకుంటారని హెచ్చరించాడు. 

 

అతడి మాటలు నిజమయ్యాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె పాత్రని ఉద్దేశిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు రానంత కాలం ఏదో ఒకటి మాట్లాడే హీరోయిన్లు అది వచ్చాక అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ మరిచిపోయే అవకాశం ఉంటుంది. అయినా ఈ విషయమై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: