సంక్రాంతి రేస్ లో అల్లు అర్జున్ మహేష్ పై ఆదిక్యంలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ఊహించని విధంగా ఈసంక్రాంతికి నిజమైన మొగుడు మహేష్ మాత్రమే అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలు ఒక పోష్టర్ ను వదిలి అందరికీ షాక్ ఇచ్చారు. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ‘సరిలేరు నీకెవ్వరు’ 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ప్రకటన ఇస్తూ మహేష్ ఓవర్సీస్ కింగ్ అంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 

మరొక వైపు ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ ప్రీమియర్ షోల కలక్షన్స్ ‘సరిలేరు’ ప్రీమియర్ షోలకు మించిపోయాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ‘సరిలేరు నీకెవ్వరు’ కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ నిన్న చాల చోట్ల 95 % ఆక్యుపెన్సీతో మహేష్ బాబు బీభత్సం కొనసాగింది అన్నవార్తలు వస్తున్నాయి.

మరొకవైపు థియేటర్ల సంఖ్య తగ్గడం 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డేతో పోలిస్తే 'సరిలేరు నీకెవ్వరు' హవా కొంత వరకు తగ్గినా రెండోరోజు కూడ ఈ మూవీకి 10 కోట్ల కలక్షన్స్ వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇంకా సంక్రాంతి పండుగ ఎంటర్ కాకపోవడం ఈ పండుగ హడావిడి నాలుగు రోజులు కొనసాగే ఆస్కారం ఉన్న పరిస్థితులలో సంక్రాంతి పండుగ పూర్తి అయ్యే సరికి ‘సరిలేరు నీకెవ్వరు’ 100 కోట్లు క్రాస్ చేయడం ఖాయం అనే ప్రచారం ఊపు అందుకుంది. 

స్పెషల్ షోస్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి వారం రోజులపాటు ఈ సినిమా హవా కొనసాగుతుందని ట్రేడ్ పండుతులు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఈరోజు సోమవారం అన్ని చోట్ల వర్కింగ్ డే కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య నిజమైన రియల్ ఫైట్ నడుస్తుందని ఈరోజు కలక్షన్స్ విషయంలో ఏ సినిమా తన ఆదిఖ్యాన్ని ప్రదర్శిస్తే ఆ మూవీ సంక్రాంతి రేస్ విన్నర్ గా పరిగణింప బడుతుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: