మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగం పెంచారు. సైరా కోసం రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న మెగాస్టార్ ఇకపై సినిమాలను త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. కొరటాల శివతో చేస్తున్న తన 152వ సినిమా కూడా కేవలం చిరంజీవి మేకోవర్ గురించి మాత్రమే కొంత ఆలస్యంగా షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం అంతా సిద్ధమై మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్ కు కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్ లో రౌండ్ అవుతున్నాయి.

 

 

అయితే.. ఈ సినిమాపై ఇప్పుడు మరో లేటెస్ట్ సమాచారం కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడనేది ఓ సమాచారం. అయితే ఇప్పుడు చరణ్ కు జోడీ కూడా ఉంటుందని లేటెస్ట్ గా అందుతున్న వార్త. రామ్ చరణ్ కు జోడీగా వినయ విధేయ రామలో కలిసి నటించిన కైరా అద్వానీని ఈ సినిమాలో తీసుకుంటున్నారని అంటున్నారు. దేవాలయాల కథాంశంపై ఈ సినిమా తెరకెక్కుతోందని ఇప్పటికే ఈ సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన చెన్నై చంద్రం టాప్ హీరోయిన్ త్రిష నటిస్తోంది.

 

 

ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా హీరోయిన్ ను సెట్ చేయడంతో సినిమాలో చరణ్ రోల్ కీలకం కానుందని తెలుస్తోంది. కైరా అద్వానీ చరణ్ తో పాటు మహేశ్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించింది. కొరటాలకు కైరాతో పని చేసిన అనుభవం ఉండటంతో అందరూ కైరా అద్వానీనే సెలక్ట్ చేశారని అంటున్నారు. ఈ వార్తలపై యూనిట్ నుంచి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: