సంక్రాంతి వచ్చిందంటే.. మూవీ లవర్స్‌కి పెద్ద పండుగ లాంటిదే. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడి పందాలతో పాటు ప్రతి ఇంటిలోనూ సినిమా సందడి కూడా ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రెండు పెద్ద‌ చిత్రాలు బ‌రిలోకి దిగిన‌ సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’.  అయితే ఈ రెండు చిత్రాల‌కు మంచి టాక్ వ‌చ్చింది. దీంతో సంక్రాంతి పండగ వేళ సినిమా థియేటర్లు కళకళలాడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడంతో సినిమా హాళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మహేశ్ బాబు, ర‌ష్మిక మంద‌న్నా హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌న చిత్రం సరిలేరు నీకెవ్వరు. 

 

ఈ చిత్రం జ‌న‌వ‌రి 11 విడుద‌ల అయ్యి హిట్ టాక్ తెచ్చ‌కుంది. మ‌రో వైపు అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. ఈ చిత్రం కూడా జ‌న‌వ‌రి 12 విడ‌ద‌లై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా పక్కా మాస్ నెట్రటైనర్ గా మాస్ ఆడియన్స్ కి ఫుల్ నచ్చితే, ‘అల వైకుంఠపురములో’ సినిమా క్లాష్ మాస్ అని తేడా లేకుండా అందరికీ తెగ నచ్చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అమెరికా, న్యూజిల్యాండ్‌లో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. 

 

ఇదిలా ఉంటే.. మొదటి రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా వరల్డ్ వైడ్ గా 46.77 కోట్ల షేర్, ఆంధ్ర తెలంగాణాలో కలిపి 32.7 కోట్ల షేర్ సాదించింది. అలాగే ఇప్పటి వరకూ కృష్ణా జిల్లాలో ఫస్ట్ డే రికార్డ్ అంటే సైరా నరసింహా రెడ్డి 3.02 కోట్లు కలెక్ట్ చేయడం. అయితే ఆ రికార్డ్ ని సరిలేరు నీకెవ్వరు సినిమా 3.07 కోట్ల షేర్ తో బద్దలు కొట్టేసింది. దీంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా ఉండ‌కుండానే బ‌న్నీ మూవీ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. కృష్ణాలో అల వైకుంఠపురములో చిత్రం మొదటి రోజు అక్షరాలా 3.11 కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ రికార్డ్ గా నిలిచింది. దీంతో బన్నీ కేవ‌లం ఒక్క‌రోజులోనే మ‌హేష్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: