తెలుగు చిత్ర పరిశ్రమను ఓ మెట్టు పైకెక్కించే ఈతరం దర్శకుల్లో ముందు వరుసలో త్రివిక్రమ్ పేరు ఖచ్చితంగా ఉంటుదనేని సత్యం. రచయితగా, దర్శకుడిగా ఎన్నో క్లాసిక్స్ అందించిన ఈ మాటల మాంత్రికుడు ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. బన్నీతో చేసిన అల.. వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రెండేళ్ల క్రితం సంక్రాంతికి పవన్ తో తీసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ ను ఈ సంక్రాంతికి అల.. వైకుంఠపురంతో బ్యాలన్స్ చేశేసాడు త్రివిక్రమ్.

 

 

అజ్ఞాతవాసిలో మిస్సైన తన మార్క్ డైలాగ్స్, టేకింగ్, స్క్రీన్ ప్లే.. అన్నింటినీ అల.. వైకుంఠపురంలో యాడ్ చేసి తనేంటో మరోసారి చెప్పాడు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా.. అల.. వైకుంఠపురం హిట్ అయినా త్రివిక్రమ్ క్రేజ్ మార్కెట్ కు వచ్చిన తేడా ఏమీ ఉండదు. కానీ.. ప్రేక్షకులో ఉన్న తనదైన మార్క్ ను మళ్లీ తెచ్చుకోవడమే త్రివిక్రమ్ చేయాల్సింది. అల..తో అదే చేసి చూపించాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిందనే న్యూస్ ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది. నిజానికి త్రివిక్రమ్ తన లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లతో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మెగాస్టార్ తాను త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నానని ఆమధ్య ప్రకటించాడు కూడా.

 

 

ప్రభాస్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనరే ఉంటుందని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ హీరోల ప్రాజెక్టులు పూర్తై త్రివిక్రమ్ కథ రెడీ చేసాక ఇవన్నీ పట్టాలెక్కుతాయి. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టు ఎన్టీఆర్ తోనే అని అంటున్నారు. గతేడాది ఫ్యాక్షన్ కథతో వచ్చిన వీరిద్దరూ ఈసారి ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: