సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. ఈ సంక్రాంతి సందర్బంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీకి ప్రేక్షకలోకం బ్రహ్మరథం పడుతోంది. చిత్రంలో మహేష్ మాస్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారని అంటున్నారు జనం.
ఈ నేపథ్యంలోనే తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. `నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్` అన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు బొమ్మ దద్దరిల్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గత సినిమాలు చూసిన వాళ్లకు ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా అంతే. ఆ ఫార్మాట్ ప్రకారం కథ రాసుకుని పక్కాగా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసాడు అనిల్.
సూపర్ స్టార్ లాంటి హీరో దొరికినా కూడా ఎక్కడా ఆ బెరుకు మాత్రం లేకుండా.. కన్ఫ్యూజన్ లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్లు చూపించాడు. దీంతో అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవరోజు మరో బిగ్ రిలీజ్ వల్ల కొంత డ్రాప్స్ ఉన్నప్పటికీ సూపర్బ్ సెకండ్ డే కలెక్షన్స్ అని చెప్పాలి. సరిలేరు నీకెవ్వరు రెండవ రోజు సుమారు 9.5 కోట్ల షేర్ సాధించి రెండు రోజుల్లో 42 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.
‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర - తెలంగాణ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 12.70 కోట్లు
సీడెడ్ – 5.44 కోట్లు
గుంటూరు – 5.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.56 కోట్లు
తూర్పు గోదావరి – 4.04 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.18 కోట్లు
కృష్ణా – 3.90 కోట్లు
నెల్లూరు – 1.58 కోట్లు
--------------------------------------------------------
రెండు రోజుల మొత్తం షేర్ – 42.1 కోట్లు
--------------------------------------------------------