ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి .సంక్రాతి కి విడుదలైన ఏ సినిమా కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోలేదు. అన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుని విజయం వైపుగా దూసుకుపోతున్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన ధర్భర్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది... ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి దూసుకుపోతుంది.. ఇక నిన్న అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురములో సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
టాలీవుడ్ విషయానికి వస్తే అసలు సిసలైన పోటీ మాత్రం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా...అల్లు అర్జున్ అలా వైకుంఠ పురములో సినిమాల మద్యే ఉంది . రజనీకాంత్ దర్బార్ సినిమా కూడా భారీ రేంజ్ లోనే క్రేజ్ ఉన్నప్పటికీ... తెలుగు హీరోలతో పోలిస్తే రజినీకాంత్ టాలీవుడ్లో తక్కువే. అందుకే ముందు ఇద్దరు హీరోల సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు జనాలు. దీంతో మహేష్ బాబు అల్లు అర్జున్ సినిమాలు ముందు ప్రస్తుతం రజిని దర్బార్ సినిమా ప్రేక్షకులకు ఆప్షన్ గా మారిపోయింది అంటున్నారు. దీంతో ఒక్కసారిగా ధర్భర్ సినిమా కి వెళ్లి ప్రేక్షకుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా టికెట్ దొరికని వారు ఈ సినిమాకు వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా ద్వారా ఎన్నో ఏళ్ల తర్వాత అసలు సిసలైన ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం టాప్ హీరోలైన మహేష్ బాబు అల్లు అర్జున్ ముందు నిలబడలేకపోయారు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అటు వాసుల్ల పరంగా కూడా ఈ సినిమాకు పెద్దగా రావడం లేదని టాక్ కూడా బలంగా వినబడుతుంది. అల్లు అర్జున్ మహేష్ బాబు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ వైపుగా దూసుకుపోతున్నాయి .