జీవితంలో కొంతమంది అదృష్టవంతులను చూస్తే పుడితే ఇలాగే పుట్టాలిరా అని అనిపిస్తుంది. వారి అదృష్టాన్ని చూస్తే అసూయ కూడా పుడుతుంది. పట్టినదల్లా బంగారమే.. ఇకపోతే ఇంతగా ఎవరి గురించి చర్చించుకుంటున్నామంటే. సినిమా ఇండస్ట్రీలోని ఒక సెలబ్రేటి జంటకోసం. మామూలుగా సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం అని తెలిసిందే. ఈ రంగుల ప్రపంచంలో అడుగు పెట్టినాక కాస్తంత పాపులారిటీ తెచ్చుకుంటే చాలు డబ్బుకు డబ్బు పేరుకి పేరు వస్తుంది.

 

 

ఒకవేళ విఫలమైతే మాత్రం ఆ తర్వాత జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకోలేం కూడా. ఇక ఆ స్టార్లకు ఉన్న పాపులారిటిని బట్టి అప్పుడు చేతిలో సినిమాలు లేకపోయినా ప్రకటనలకు, ఈవెంట్లకు హాజరైతే చాలు ఎంతైన ఇచ్చుకోనికి నిర్వాహకులు సిద్దంగా ఉంటారు.. ఇకపోతే ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన పలువురు పవర్ కపుల్స్ ఇలాంటి ప్రకటనలు, ఈవెంట్స్‌కు ఒప్పుకుంటూ కోట్లు సంపాదించేస్తున్నారన్న విషయం తెలిసిందే..

 

 

ఇలాంటి వారిలో ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చూ. ఇకపోతే ఈ పవర్ కపుల్స్ ఇద్దరిని, ఇటీవల ఓ బేబీ కేర్ ప్రొడక్ట్ లాంచ్ కోసమని ఓ ఈవెంట్ నిర్వాహకులు ఆహ్వానించారట. ఇందుకు అడిగినంత ఇస్తామని కూడా చెప్పారట. అది కూడా కేవలం మూడు గంటల పాటు ప్రోగ్రామ్‌లో ఉండటానికి. అడిగినంత ఇవ్వడానికి ఈవెంట్ నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. ఇక పోతే వీరు అడిగిన అమౌంట్ తెలిస్తే షాక్ అవ్వాలిసిందే. అదేమంటే వారిద్దరికి కలిపి కోటిన్నర అడిగారట.

 

 

ఆ డీల్ ఒకే అయ్యింది. అయితే ఆ నిర్వాహకులు ఈ ప్రొడక్ట్ లాంచ్‌కి కరీనా, సైఫ్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే.. వారి ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ వల్ల. తైమూర్‌కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల తైమూర్‌ని ఈవెంట్‌కి తీసుకొస్తే తమ బ్రాండ్‌ను బాగా ప్రమోట్ చేసుకోవచ్చని అనుకున్నారు.

 

 

ఇది ఇప్పటి ఆలోచన కాదట. దాదాపు ఒక సంవత్సరం నుండి నిర్వాహకులు కరీనా, సైఫ్, తైమూర్‌ల కోసం వేచి చూస్తున్నారట. ఇక అంత పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పినప్పుడు ఈవెంట్‌కి రాకుండా ఎవరైనా ఉంటారా అని అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: