మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సైరా సినిమా తర్వాత చాలా రోజులుగా ఖాళీగానే ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నెక్ట్స్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఏడాది కిందే సెట్ అయిన కొరటాల సినిమాను ఇప్పుడు సెట్స్‌పైకి తీసుకొచ్చాడు చిరు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమా అట. 

 

ఈసారి శివ ‘ఆలయాలపై నిర్లక్ష్యం, వాటి వెనుక జరుగుతోన్న అవినీతి’ అనే కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకున్నారని టాక్.  ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఆలయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆలయ భూములను అక్రమంగా కొట్టేసే రాజకీయ నాయకులపై చిరు పోరాడతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌న్ కూడా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. మరోసారి చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌ చరణ్‌ తన డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరంజీవి చరణ్ కలిసి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. కథా పరంగా చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 40 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. తెరపై ఆ పాత్ర నిడివి ఎంతవరకూ ఉంటుందో తెలియదుగానీ, కొరటాల ఏదో పెద్ద ప్రయోగమే చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో బిజీగా వున్న చరణ్, ఆ తర్వాత‌ కొరటాల సెట్స్ పైకి వస్తాడని అంటున్నారు.  మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: