టాలీవుడ్ లో పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ లో నటించారు.  అప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీపై ఎన్నో అనుమానాలు ఉన్న ఫ్యాన్స్ ఈ మూవీలో మెగాస్టార్ స్టామినా చూసి షాక్ అయ్యారు.  ద్విపాత్రాభినయంతో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు.  ఈ మూవీ సూపర్ హిట్ అందుకున్న తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మొదటి తెలుగు వీరుడు రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కించారు. దేశ భక్తి నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు.

 

తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.  తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  దేవాదాయశాఖలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసే పాత్రలో మెగాస్టార్ నటించబోతున్నట్లు టాక్.  అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ మూవీలో చిరంజీవి ఓ సన్నివేశంలో కనిపించిన విషయం తెలిసిందే.  

 

ఆ తర్వాత శీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ మూవీలో తండ్రీ కొడుకులు ఓ సన్నివేశంలో నటించారు.  ముచ్చటగా మూడోసారి వీరిద్దరు తెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే  చరణ్ సరసన బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలసి గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' మూవీలో నటించారు. కాకపోతే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..  ఇందులో ఎంత నిజం ఉందనేది ఆ చిత్ర దర్శక..నిర్మాతలు క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: