టాలీవుడ్ లో బాహుబలి మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇటీవల సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’ మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు.  దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చుపెట్టి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.  మొదటి నుంచి భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేక పోయింది.  దాంతో ప్రభాస్ తన తరువాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం సాహో మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ త‌న 20వ మూవీ జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్ అనే టైటిల్‌తో ఈ చిత్రం కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.  

 

అయితే ఈ మూవీకి జాన్ అని పెట్టాలని చిత్ర యూనిట్ భావించారట.  ఇటీవ‌ల శ‌ర్వానంద్, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు.   కాగా,  జాను అనే టైటిల్‌ని 96 రీమేక్ మూవీకి పెట్ట‌డంతో ప్ర‌భాస్ 20వ చిత్ర నిర్మాత‌లు త‌మ సినిమాకి వేరే టైటిల్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  మరి ఈ మూవీ ఏ పేరుతో రాబోతుందో దీనిపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇస్తే కాని తెలియదు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సినిమా చేస్తారనినే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

 

ప్రభాస్ ఇంతవరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి సినిమా చేయలేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ మూవీ భారీ అంచనాలతోనే ఉండబోతుందని అంటున్నారు టాలీవుడ్ వర్గం.  అందుకే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ తో ‘అల వైకంఠపురములో’ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు త్రివిక్రమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: