కథకు తగినట్టుగా మాటలు రాయడం అందరు చేసే పనే.. కాని చెప్పే కథను మనసుకి తాకేలా మన మనసులకు దగ్గరగా మాటలు రాయడం మాత్రం ఒక్క త్రివిక్రం కు మాత్రమే చెల్లుతుంది. అందుకే ఆయన్ను మాటల మాంత్రికుడు అని అంటారు. రైటర్ గా మొదలైన ఆయన సినిమా ప్రయాణంలో డైరక్టర్ గా కూడా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు. నువ్వే నువ్వే నుండి అల వైకుంఠపురములో వరకు త్రివిక్రం ప్రతి సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంతేకాదు కథ, కథనాలు ఎలా ఉన్నా మాటలు మాత్రం గుర్తుండిపోయేలా ఉంటాయి.

 

లేటెస్ట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా త్రివిక్రం తన పెన్ పవర్ ఏంటో చూపించాడు. అల్లు అర్జున్, త్రివిక్రం హ్యాట్రిక్ కాంబోని సూపర్ హిట్ చేసేలా అల వైకుంఠపురములో అంచనాలను అందుకుంది. ఇక ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ చూసిన మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా విజిల్స్ వేసేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయ్యుండి వేరే స్టార్స్ పాటలకు డ్యాన్స్ చేయడం అంటే అది మాములు విషయం కాదు. 

 

అయితే ఆ ఎపిసోడ్ సినిమాకు మరింత బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఆ ఎపిసోడ్ ఆలోచన త్రివిక్రం చెప్పగానే బన్ని ముందు ఆలోచించినా ఆ తర్వాత ఓకే అనేశాడట. ఈ సినిమాలోనే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ ఇప్పించాడు త్రివిక్రం. అంతేకాదు ప్రస్తుతం స్టార్ హీరోలందరికి ప్రత్యేక స్నేహితుడు త్రివిక్రం. పవన్, మహేష్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ ఇలా అందరితో త్రివిక్రం మంచి రిలేషన్ ఉంది. అందువల్లే ఆయన సినిమాల్లో ఇలాంటి సర్ ప్రైజులు ఉంటున్నాయి. అంతేకాదు ఇలాంటి హీరోలు చేయడం వల్ల మేమంతా ఒక్కటే అంటూ ఫ్యాన్స్ కు ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని ఇన్నర్ థాట్. అయితే అభిమానులు ఎలా ఉన్నా త్రివిక్రం చేస్తున్న ఈ స్టార్ యునైటెడ్ కార్యక్రమం మాత్రం సక్సెస్ అవుతున్నట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: