‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు మరియు మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. దీంతో 'బాహుబలి' సినిమా తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ నేపథ్యం కలిగిన స్టోరీ సాహో సినిమా చేయడం జరిగింది. ప్రభాస్ కెరీర్ లోనే దాదాపు భారీ స్థాయిలో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. కానీ ఈ సినిమా రిజల్ట్ మొట్ట మొదటి షోకే అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

 

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా విషయంలో టైటిల్ విషయంలో ప్రభాస్ కి అదిరిపోయే షాక్ సమంత ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ ఏమిటంటే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ని సెట్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఇదే టైమ్ లో మరో పక్క శర్వానంద్ - సమంత జంటగా నటిస్తున్న 96 రీమేక్ కి జాను అనే టైటిల్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ అదే టైటిల్ సింక్ అయ్యే విధంగా ఇంత పెద్ద సినిమాకు జాన్ అనే టైటిల్ సెట్ చేయడం అవసరమా అని ప్రభాస్ డైలమాలో పడినట్లు...సమంత శర్వానంద్ చేసిన సినిమా పేరు మన సినిమా పేర్లు ఒకే విధంగా ఉండటంతో ప్రమోషన్ విషయంలో కూడా సినిమా కొంత దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో మార్చాలని డైరెక్టర్ రాధాకృష్ణ కి సూచించినట్లు సరికొత్త టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఒకేసారి రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా నడుస్తుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని యూరప్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. అసలైతే ఈ షెడ్యూల్ కూడా యూరప్ లోనే చేయాలనీ అనుకున్నారు.  కానీ మళ్ళీ కొన్ని కారణాలతో ఇండియాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: