స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమా సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఆయన మరో చిత్రాన్ని చేయడానికి సంవత్సరంన్నర గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశ పర్చలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి నుండి ఎంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది.

 

 

సినిమాకి ముందే ఆడియో హిట్ అయిపోయింది. ఇక సినిమా హిట్ అవడం పక్కా అనే టాక్ వినపడింది. అనుకున్నట్టుగానే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డులని సృష్టిస్తోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరిన్ని రికార్డుల దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో రిలీజైన బన్నీ చిత్రాలన్నింటిలోకి ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

 

 

గతంలో రేసుగుర్రం చిత్రం ఉండగా, ఇప్పుడు ఆ సినిమాని దాటుకుని అల వైకుంఠపురములో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను అల తన సత్తా చాటుతుంది. గుంటూరులో తొలిరొజు రూ.3.41 కోట్ల షేర్ అందుకున్న ఈ చిత్రం ఉత్తరాంధ్రలో రూ.2.8 కోట్లు, కృష్ణాలో రూ.2.57 కోట్లు, నైజాం ఏరియాలో రూ.6 కోట్లు రాబట్టింది.ఇక మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు నమోదయ్యాయి.

 

 

ఇప్పటి వరకు నమోదయిన వసూళ్ళని గమనిస్తే బన్నీ కెరీర్లోనే ఇవి అత్యధిక వసూళ్ళుగా తెలుస్తుంది. అలాగే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. రెండు రోజులకే ఇన్ని రికార్డులు నెలకొల్పిన ఈ సినిమా ముందు ముందు మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: