మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన 'అల.. వైకుంఠపురములో' సినిమాకి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. దాదాపు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత 'నా పేరు సూర్య..' లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాల మేరకు సినిమా ఉండటంతో దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా యూనిట్ ప్రస్తుతం సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతోంది.

 

ఇటువంటి నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తన వైఫ్ గురించి సక్సెస్ సమావేశంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో నవదీప్ ఓ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించిన నవదీప్ ఈ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సినిమా థాంక్స్ మీట్ లో కూడా బన్నీ.. నవదీప్ గురించి బాగా మాట్లాడారు.

 

ఇదిలా ఉండగా.. నవదీప్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆడియన్స్ ని నవ్విస్తున్నాయి. ముందుగా మైక్ తీసుకొని తన చిత్రబృందాన్ని ఒక్కొక్కరుగా గుర్తు చేసుకుంటూ వారి గురించి గొప్పగా మాట్లాడారు త్రివిక్రమ్. ఈ క్రమంలో నవదీప్ పేరు మర్చిపోయారు. వెంటనే తేరుకొని.. మైక్ తీసుకున్నాడు. ''నవదీప్ గురించి మాట్లాడకపోతే తనేం.. ఫీల్ అవ్వడు.. పాపం మంచోడు.. కానీ మా ఆవిడ మాత్రం ఫీల్ అవుతుందని'' అన్నాడు త్రివిక్రమ్. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 1 అప్పటినుండి తన భార్య కొడుకు నవదీప్ కి అభిమానులు అని కేవలం పర్టిక్యులర్ గా నవదీప్ ని చూడటం కోసం తన భార్య ప్యారిస్ దేశానికి వచ్చిందని త్రివిక్రమ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: