సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే చాలు సినిమాళ్ళ‌కి పెద్ద‌పండ‌గ‌నే చెప్పాలి. పెద్ద పెద్ద హీరోలంద‌రూ సంక్రాంతి బ‌రిలోకి దిగుతారు. ఈ సంవ‌త్స‌రం సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాయి. అందులో ఒక‌టి ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్‌` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ టాక్ ను సంపాదించుకుంది. త‌ర్వాత వ‌చ్చిన అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు`, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం విడుద‌లైంది. 

 

ఇక ఈ చిత్రాల్లో విన్నర్  తమ  చిత్రమేనంటూ  ఓ పోస్టర్ ను  విడుదల  చేసింది  ‘అల వైకుంఠపురములో`  చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ బాక్సాఫీస్‌ను బ‌ద్ద‌ల‌కొట్టింది.  30 కోట్ల షేర్ వచ్చినట్టు  సమాచారం. నైజాంలో రూ. 5 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌ లో రూ. 2.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2 కోట్లు, గుంటూరులో రూ. 3 కోట్లు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో సుమారు రూ. 3 కోట్లు కలిపి, మొత్తం  మీద ఏపీ, టీఎస్ లో ఫస్ట్ డే రూ. 20 కోట్లు  వసూలు అయినట్టు సమాచారం. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు రూ.3.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

 

ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి విన్న‌ర్ మేమే అంటూ అల్లుఅర్జున్  మూవీ టీమ్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. మా అభిమాన హీరోను రెచ్చ‌గొట్టేలా ఉందంటూ ఫ్యాన్స్ గ‌గ్గోలుపెడుతున్నారు. సంక్రాంతి విన్న‌ర్ అని వేసుకోవ‌డ‌మేంటి మా చిత్రం కూడా హిట్టే క‌దా అని మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో దీని పై పెద్ద చెర్చే కొన‌సాగుతుంది. చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. మ‌రికొంత మందైతే ఇది క్లాస్ హిట్టైతే, అది మాస్ హిట్టఅని  అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: