సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్ . ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార నటించగా...  రజనీకాంత్ కూతురు గా నివేదాథామస్ నటించింది. కాగా ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇంతకు మునుపు మురుగదాస్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బంపర్ విక్టరీ సాధించడంతో ఈ  సినిమా కూడా మరోసారి విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అటు హీరో రజనీకాంత్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్ల నుంచి తన స్థాయి హిట్  మాత్రం దక్కలేదు రజినీకి . ఏకంగా రోబో 2.0 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ కు నిరాశే ఎదురైంది. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. 

 

 

 ఇక సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది విజయం వైపుగా పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో రజనీ యాక్షన్ స్టైల్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ  మాకు పైరసీ దెబ్బ తగిలి నిర్మాతలు విలవిలా పోతున్నారు. ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో పైరసీ బెడద రోజురోజుకు ఎక్కువవుతోన్న  విషయం తెలిసిందే. తమ చిత్రం పైరసీ బారిన పడకూడదని చిత్ర నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... సినిమా పైరసీ మాత్రం అవుతూనే ఉంది. తాజాగా రజనీకాంత్ దర్బార్ సినిమా కూడా ఇదే సమస్య వచ్చి పడింది. 

 

 

 సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఓ లోకల్ టీవీ ఛానల్ లో ప్రసారమైనది. అసలు మొదటనే రజనీకాంత్ దర్బార్ సినిమా వాట్సాప్ లో లీక్ అయింది. అది కూడా హెచ్ డి  నాణ్యతతో వాట్సాప్ లో లీక్ అయింది. ఇంతలో శరణ్య టీవీ ఛానల్ దర్బార్ సినిమా టీవీలో ప్రసారం చేసింది. కాగా ఇది తెలిసిన నిర్మాతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మధురైకి చెందిన ఈ ఛానల్ పై దర్బార్  చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా శరణ్య టీవీ ఛానల్ యాజమాన్యం పై ఫిర్యాదు కూడా చేసింది దర్బార్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: