సంక్రాంతి కి బరిలో దిగిన పందెం కోళ్ళ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతుందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో వరుసగా భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా ..! అంటూ పోటీపడుతున్నాయి. సంక్రాంతి సెలవులు ఈ సినిమాలకు పెద్ద ప్లస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏ సినిమా ఎంత వసూలు చేసింది?  ఏ హీరో ఏ రికార్డ్ ను బ్రేక్ చేశారు? అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక వసూళ్ల లెక్కల గురించి బయటకు మాట్లాడలేం అంటూనే కొందరు ఇంత వసూలు చేసింది అంత వసూలు చేసింది అంటూ వచ్చిన లీకులతో ఫిలిం నగర్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోందట.

 

తాజాగా సంక్రాంతి సందర్భంగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు....బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాలు 11,12  తేదీలలో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల కంటే ముందు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ రిలీజైనా ఆ సినిమా విషయంలో ఎలాంటి హడావుడి లేదు. పట్టించుకున్న నాధుడేలేడు. కానీ.. సరిలేరు, అల... సినిమాల విషయంలో ఫ్యాన్స్ మధ్య కాస్త హంగామా ఎక్కువగానే ఉంది. ఫ్యాన్స్ సోషల్ మీడియా డిబేట్లు వేడెక్కిస్తున్నాయి. మావాడి కలెక్షన్ ఇంత అంటే మావాడు ఇంత వసూలు చేశాడు అంటూ ఫేక్ కలెక్షన్ల రిపోర్టులు హల్ చల్ చేస్తున్నాయి. రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్ లు దక్కాయి. ప్రీమియర్ల ద్వారా భారీగానే వసూలైనట్లు ఇప్పటికే ప్రచారాలు చేసేస్తున్నారు. 

 

ఎవరికి నచ్చిన అంకెలు వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. సరిలేరు ఇప్పటికే 40  కోట్లు గ్రాస్ తెచ్చిందని ఒకరు... లేదు 66 కోట్లు అని మరి కొందరు... ఇంకొకరు ఇది పాన్ ఇండియా సినిమా 70 కోట్లుపై మాటేనని రకరకాలుగా ప్రచారం చేసేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఇది ఒక బాలీవుడ్ సినిమాకి అయినా సాధ్యంకానిది. పైగా సరిలేరు టాక్ కూడా అంత బాగాలేదు. అయితే ట్రేడ్ మాత్రం సరిలేరు తొలి రోజు 40 కోట్ల వసూళ్లకు తగ్గకుండా ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక అల వైకుంఠపురములో సినిమాకి సంబందించిన లెక్కలు తేలాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ లో మాత్రం ఇంత అంత అంటూ ఇప్పటికే ప్రచారమవుతోంది. మరి సోషల్ మీడియాల్లో ఇలాంటి ఉతుత్తి ప్రచారాలకు పుల్ స్టాప్ పెడుతూ చిత్రబృందాలు అధికారికంగా కలెక్షన్ల రిపోర్ట్ ఎంటో చెబితే ఈ ఫేక్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: