అనసూయ.. అందానికే అసూయా తెప్పించే అందం ఆమెది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడం లేట్ అయినా ఫ్యాన్స్ ను దక్కించుకోవడంలో మాత్రం ఆలస్యం అవ్వలేదు. అలాంటి అందమైన ఈ భామ ఎప్పుడు విమర్శలు పాలవుతుంటుంది. ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న ఈ భామకు అభిమానులతో పాటు అనసూయను తిట్టుకునేవారు ఎక్కువే.. 

 

ఎందుకంటే.. ఆమె ధరించే దుస్తులు వారికీ నచ్చక ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతే కాదు సమయం సందర్భం లేకుండా ఒకోసారి ఫోటో షూట్ లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కూడా ఆమె విమర్శల పాలవుతుంటుంది. ఒకొక్కసారి అనవసర విషయాలపై రెస్పాండ్ అయ్యి విమర్శలకు గురవుతే... మరోసారి అవ్వక అవుతుంటుంది. 

 

మొన్న జరిగిన దిశ ఘటనపై స్పందించక విమర్శలపాలైయింది.. మరి దారుణంగా భూతులు తిట్టేసరికి నెటిజన్లపై ఫైర్ అవుతూ రెస్పాండ్ అయ్యింది... ఆ తర్వాత యాపిల్ పండ్ల తోటలో కుటుంబంతో కలిసి వెళ్లిన ట్రిప్ లో అనసూయ దుస్తులపై వచ్చిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

పిల్లల తల్లివి.. ఏలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకో అని కొందరు అంటే.. మరి కొందరు.. చీర కట్టుకొని సంప్రదాయంగా ఉండు అని అప్పట్లో కామెంట్లు చెయ్యడంతో ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం అనసూయ జి సినీ అవార్డ్స్ 2020 కు వెళ్ళింది. అయితే అక్కడ ఆమె మంచి డ్రెస్ ఏ వేసుకెళ్లింది.. కాకపోతే కొంచం బాగోలేదు. అది కాస్త ఫోటో షూట్ లో మరి దారుణంగా ఉన్నాయి ఫోటోలు. ఆ ఫోటోలను అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యగా.. కొందరు సూపర్.. బ్యూటిఫుల్ అని అనగా.. మరికొందరు మాత్రం.. అనసూయ ఆంటీ అవసరమా మీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాములుగా ఉండే కామెంట్లపైనే స్పందించే అనసూయ.. ఇప్పుడు ఏకంగా ఆంటీ అంటున్నారు.. మరి ఈ కామెంట్లపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: