నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. సంక్రాంతి కానుకగా జనవారి 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రాం సినిమాకు సంబందించిన విషయాలతో పాటుగా చాలా విషయాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అనీల్ రావిపుడికి తను సక్సెస్ ఇచ్చానని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనీల్ రావిపుడికి నేను సక్సెస్ ఇవ్వడం ఏంటి..? అతనో టాలెంటెడ్ డైరక్టర్ అందుకే అతనితో చేసిన పటాస్ హిట్ అయ్యింది. దానిలో నేను అతనికి సక్సెస్ ఇచ్చింది ఏముందని అన్నారు కళ్యాణ్ రాం.

 

ఒకరికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వడంలో ఈ నందమూరి హీరో తర్వాతే ఎవరైనా అన్నట్టుగా కళ్యాణ్ రాం మాటలు ఉండటం విశేషం. అంతేకాదు సురేందర్ రెడ్డిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా ఆయనతో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తున్నారని అన్నారు. 2005 లో అతనొక్కాడే చేశాం.. మధ్యలో చాలాసార్లు కలిసి చేద్దామని అనుకున్నాం కాని వర్క్ అవుట్ అవలేదు. కిక్ 2 కలిసి చేశాం. ఆ సినిమా నేనే నిర్మించానని అన్నారు కళ్యాణ్ రాం. అయితే కొన్నాళ్లుగా సురేందర్ రెడ్డితో సినిమా అనుకుంటున్నా కుదరడం లేదని అన్నారు.

 

ఇక తన సినిమాతో డైరక్టర్ గా పరిచయమై సూపర్ సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్న అనీల్ రావిపుడితో కూడా పటాస్ తర్వాత మరో సినిమ అనుకున్నా అని.. కాకపోతే ఇద్దరం కలిసి చేసే కథ దొరకలేదని అన్నారు కళ్యాణ్ రాం. ప్రస్తుతం చేసిన ఎంత మంచివాడవురా సినిమా గుజరాతి సినిమా ఆక్సీజన్ కు స్పూర్తిగా వస్తుందని.. ఈ సినిమాకు ముందు ఆల్ ఈజ్ వెల్ అని టైటిల్ అనుకున్నామని.. అది అందరికి నచ్చినా సతీష్ వేగేశ్న ఇంతకుముందు రెండు సినిమాలకు శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం అని టైటిల్స్ పెట్టారు కాబట్టి ఈ సినిమా స్టోరీ ఆధారంగా ఎంత మంచివాడవురా అని టైటిల్ పెట్టారని అన్నారు కళ్యాణ్ రాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: