అరుంధతి సినిమా తర్వాత స్వీటి అనుష్క టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు ఆ తర్వాత నుంచి ఎక్కువగా అనుష్కకి లేడీ ఓరియెంటెడ్ సినిమాలే వచ్చాయి. దాదాపుగా హీరోల సరసన నటించే అవకాశాలే తగ్గిపోయాయి. అందులో భాగంగానే  భాగమతి సినిమాని చేసింది. ఆ సినిమా అనుష్క సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక ఆ తర్వాత అనుష్క సినిమాలు చ్రయకుండా బెంగుళూరుకే పరిమితమైంది. కాస్త బొద్దెక్కడంతో అనుష్క కి అవకాశాలు తగ్గాయన్న టాక్ కూడా ఉంది. ఇక మొన్నా మధ్య మెగాస్టార్ నటించిన 'సైరా: నరసింహారెడ్డి' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. చిన్న పాత్ర పోషించింది. ఆ పాత్ర అనుష్కకి మంచి పేరే తీసుకువచ్చింది. 

 

ఇక తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అక్కడ నుంచే నిశ్శబ్ధం షూటింగ్ కి హజరయ్యేది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీటయింది. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని జనవరి 31న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే రిలీజ్ సమయం దగ్గరపడుతున్నప్పటికి ఇప్పటివరకూ ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. ఇక స్వీటీ ఈ సినిమా విషయంలో ఏమీ పట్టనట్టుగా మీడియాకు దూరంగా ఉండటంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. దీంతో అనుష్క ఏమనుకుందో? ఏమోగానీ మీడియాకి టచ్ లోకి వచ్చింది. తన సినిమా అప్ డేట్ ని వెల్లడించి...సంక్రాంతి తర్వాతి నుంచి ప్రచారం మొదలు పెడతామని తాజాగా వెల్లడించింది. 

 

ప్రస్తుతం తన అమ్మా నాన్నలతో ఉన్న స్వీటి పొంగల్ అయిపోగానే నిశ్శబ్ధం ప్రమోషన్స్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమాకి ప్రమోషన్స్ చేస్తారట. అయితే సంక్రాంతి కి రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టినా ఎవరూ పట్టించుకోరు కాబట్టే సైలెంట్ గా ఉన్నారట. ఇక సంక్రాంతి తర్వాత అనుష్క హైదరాబాద్ కి వచ్చేస్తుందట. భాగమతి తర్వాత పూర్తి స్థాయిలో  నిశబ్ధం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తెలుగు- తమిళ్ భాషల్లో ఈ సినిమాని కోన ఫిల్మ్ కార్పోరేషన్- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. మాధవన్ - అంజలి- సుబ్బరాజు- షాలిని పాండే- అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తోన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: