టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆనలుగురులో ఒకరుగా పేరు గాంచిన దిల్ రాజ్ చెప్పుచేతలలో నైజాం ఏరియాలోని ధియేటర్స్ ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఆయన ఒక్కమాట చెపితే ఆయన మాటకు అనుగుణంగా కోటి రూపాయలు తగ్గించి ఒక సినిమాను ఆయనకే ఇవ్వాలి కాని మరొకరికి ఇస్తే ఆ సినిమా విడుదల అవ్వడం కష్టం అన్న గాసిప్పులు ఎప్పటి నుండో ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదలైన కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ మూవీకి కనీసపు ధియేటర్స్ కూడ దొరకకపోవడం ఒక హాట్ న్యూస్ అయితే దాని వెనుక దిల్ రాజ్ హస్తం ఉంది అని జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో మాత్రమే కాదు ఉత్తరాంద్ర  ప్రాంతంలో కూడ పట్టుమని 15 ధియేటర్లు దొరకలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి చాల చోట్ల ‘దర్బార్’ మూవీ ప్రదర్శింప బడుతున్న ధియేటర్లలో ఏమాత్రం కలక్షన్స్ లేకపోయినా ఆ ధియేటర్లను కూడ కళ్యాణ్ సినిమాకు ఇవ్వకుండా చుక్కలు చూపించారు అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీలో వివాదాలకు అతీతంగా ఉండే కళ్యాణ్ రామ్ సినిమాకు ఇలాంటి స్థితి ఏమిటి అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

వాస్తవానికి మహేష్ అల్లు అర్జున్ ల సినిమాల మధ్య ‘ఎంత మంచి వాడవురా’ విడుదల ఒక సాహసం అనీ మొదటి నుంచి అనుకుంటున్నా ఇలాంటి పరిస్థితి తన సినిమాకు ఎదురౌతుందని కళ్యాణ్ రామ్ కూడ ఊహించి ఉండడు. దిల్ రాజ్ కు జూనియర్ ఎన్టీఆర్ లకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అవకాశం వస్తే మళ్ళీ మరొకసారి మరో సినిమాను తీయడానికి దిల్ రాజ్ ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ విషయాలు జూనియర్ దృష్టి వరకు వెళ్ళలేదా వెళ్ళినా జూనియర్ పట్టించుకోవడం లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: