ఈ సంక్రాంతికి రిలీజైన సరిలేఉ నీకెవ్వరు మరియు అల వైకుంఠపురములో చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. సంక్రాంతి పండగ కంటే ముందే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. రెండు పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడం నిజంగా మంచి పరిణామం. ఈ సంవత్సరం మొదట్లోనే ఇంత పెద్ద హిట్లు పడటం శుభ పరిణామం. అయితే రెండు సినిమాలు వేటికవే సాటిగా ఉన్నాయి. ఒక సినిమానేమో కంప్లీట్ మాస్ సినిమా అయితే మరోటి మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

 

అయితే ఈ రెండు సినిమాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అయితే సెలెబ్రిటీల నుండి మాత్రం అల వైకుంఠపురములో సినిమాకి మాత్రం బాగా సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అల వైకుంఠపురములో చిత్రం గురించి చాలా పొగిడాడు. బావా అంటూ అల్లు అర్జున్ నటనని ప్రశంసించాడు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ సినిమాని ప్రశంసించి బొకే కూడా పంపాడు. అయితే వీరిద్దరూ త్రివిక్రమ్ తో ఉన్న స్నేహం కారణంగానే ఇలా చేశారని అంటున్నారు.

 

ఎన్టిఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అదీ గాక అంతకుముందు చిత్రమైన అరవింద సమేత కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడంతో... ఆ స్నేహం కారణంగానే ఎన్టిఆర్ అల టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేసాడని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ తో ఉన్న దోస్తీ గురించి అందరికీ తెలిసిందే ..అలాగే ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణతో కూడా పవన్‌కి మంచి రిలేషనే వుంది. 

 

అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవడంతో ఆ బ్యానర్లో మరో చిత్రం చేయడానికి పవన్‌ కమిట్‌ అయ్యాడు. త్రివిక్రమ్‌ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది. పై కారణాల వల్లే సెలెబ్రిటీలు ఈ సినిమా గురించి మాట్లాడారని అంటున్నారు. ఏదైతేనేమి ఒక హీరో సినిమా గురించి మరో హీరో మాట్లాడడం మంచి పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: