బొమ్మరిల్లు సినిమా తో తన ఇంటి పేరునే మార్చేసుకున్న దర్సకుడు భాస్కర్... ఈ సినిమా తర్వాత అతడు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ బొమ్మరిల్లుతోనే అతడికి గుర్తింపు లభించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ బొమ్మరిల్లు ఫాదర్ అనే మాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్నాడు.

 

 

అఖిల్ తన నాలుగవ చిత్రాన్ని భాస్కర్ తో చేస్తున్నాడు. చేసిన మూడు సినిమాలు కూడా ఏమంత ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సారి చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాకి భాస్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదట. ఈ మేరకు నిర్మాతలు అతనికి లాభాలో వాటా ఇస్తామని ఒప్పుకున్నారట.

 

 

భాస్కర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు కాబట్టి అతనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా తెరకెక్కించి లాభాల్లో వాటా ఇచ్చేటట్లుగా ఒప్పుకున్నారట. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం సినిమాకి కూడా పరశురాం కి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. కానీ లాభాల్లో వాటా ఇవ్వడంతో ఏకంగా తొమ్మిది కోట్లు వచ్చాయట. ఇలా సినిమా హిట్ అయితే బానే ఉంటుంది కానీ ఫ్లాప్ అయితే ఏంటన్నది పరిస్థితి.

 

 

ఇలా చేయడం వల్ల దర్శకుడు మరింత శ్రద్ధతో సినిమా చేస్తాడని కొందరు వాదిస్తున్నారు. మరికొందరేమొ రెమ్యునరేషన్ లేకుండా పనిచేయడం సాధ్యం కాదని అంటున్నారు. మరి అఖిల్ తో చేస్తున్న ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా చూడాలి. ఈ సినిమా హిట్ అవడం అఖిల్ కి కూడా చాలా ఇంపార్టెంట్...

మరింత సమాచారం తెలుసుకోండి: