సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కొరియన్ సినిమాల రీమేక్ మీద దృష్టి నిలిపాడు. మొన్నటికి మొన్న కొరియన్ మూవి అయిన మిస్ గ్రానీ సినిమాని సమంత తో ఓ బేబిగా రీమేక్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో సమంత నటన ప్రేక్షకుల నుండే కాక, విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

 

అయితే ప్రస్తుతం మరో కొరియన్ మూవీని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  కొరియన్ లో సూపర్ బ్లాక్ బస్టర్ సాధించిన ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మిడ్ నైట్ రన్నర్ అనే సినిమా ఒక యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారట. ఓ బేబీ సినిమాని డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ప్రస్తుతం వేరే ప్రాజెక్తుతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కించాలని చూస్తున్నరట.

 


సుధీర్ వర్మ యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ సినిమాలు తీయడంలో దిట్ట. ఆయన మొట్ట మొదటి సినిమా అయిన స్వామిరారా సినిమా యాక్షన్ మరియు కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ అవకాశాన్ని సుధీర్ వర్మకి ఇస్తే బాగుంటుందని చూస్తున్నారట. అయితే సుధీర్ వర్మ తాజా చిత్రమైన రణరంగం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే..

 


ఇప్పటి వరకు ఈ రీమేక్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది అధికార సమాచారం మాత్రం రాలేదు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విషయమై అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారనేది చాలా ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: