ఈ సంక్రాంతికి తెలుగులో రెండు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. రెండు సినిమాలకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో హీరోలు, చిత్ర యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ సంతోషాన్ని చెడగొట్టడానికిఆ అన్నట్టు పైరసీ మూకలు చెలరేగుతున్నాయి. ప్రతీ సారి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా పైరసీ మాత్రం ఆగట్లేదు.

 

 

సే నో టూ పైరసీ అని ఎన్ని క్యాంపేయిన్లు చేసినా పైరసీని ఆపలేకపోతున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు విడుదల అయిన కొద్ది సేపట్లోనే ఈ సినిమాల పైరసీ ప్రింట్లు ఆన్ లైన్లో దర్శనమిచ్చాయి.  సూపర్ స్టార్ ఓ అడుగు ముందుకేసి నో పైరసీ అంటూ క్యాంపైన్ రన్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎవడూ మారడం లేదు. విడుదల రోజే ఆన్‌లైన్‌లో పెట్టేసి సినిమా ఫ్యూచర్ ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు.

 

 


సినిమాని థియేటర్లలోనే చూస్తే మజా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి.. డబ్బు సంపాదన కోసం ఇలా పైరసీ చేసి సినిమా మీద ఆధారపడ్డ కొన్ని వందల జీవితాల కడుపు మీద కొడుతున్నారు. పండగ సందర్భంగా విడుదల అయిన ఈ రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ రావడంతో పైరసీ మూకలు మరింతగా పెరిగిపోయాయి. ఏదేమైనా కూడా సంక్రాంతి సినిమాల పైరసీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. 

 

 

తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లపై కూడా ఇప్పుడు సైబర్ పోలీసులు నిఘా వేసి ఉంచారు. దాంతో పాటు నిర్మాతలు కూడా ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఏదీ కంట్రోల్ కావడం లేదు. మరి ఇంత పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సినిమాలకి ఈ పైరసీ బెడద ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: