సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన రెండు సూప‌ర్‌స్టార్ హీరోల చిత్రాల పోటీలు మాములుగా లేవు. ఒక‌టి మ‌హేష్ స‌రిలేరు, రెండోది అల‌వైకుంఠ‌పురం, ఇవి రెండు సినిమాలు ఓపెనింగ్స్ మాములుగా లేవు. ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి క‌లెక్ష‌న్లు భారీగా వ‌సూలు చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ కావ‌డంతో ఈ చిత్రాల టాక్ తో సంబంధం లేకుండా..వ‌సూళ్ళ‌యిపోతున్నాయి.  

 

ఇక ఈ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రి క్రేజ్‌తో వారు వ‌సూళ్ళు రాబ‌డుతుంటే. కొంత మంది ఫ్యాన్స్ ఈ సినిమాల‌కు సంబంధించిన ఫేక్ వ‌సూళ్ళ‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అయితే జెన్యూన్ ఫ్యాన్స్ మాత్రం ఎవ్వ‌రూ వీటిని ఎంక‌రేజ్ చేయ‌డం లేదు. నిజానికి, తమ అభిమాన హీరో సినిమా మంచి విజయాన్ని కోరుకోవాలని మాత్రమే అభిమానులు ఆశిస్తారు. ఫేక్‌ వసూళ్ళ ప్రచారాలకొచ్చేసరికి.. సగటు సినీ అభిమానికి వెగటు పుట్టేలా ఉంటుంది. 

 

ఆమ‌ధ్య ఇలాగే ఓ స్టార్ హీరో త‌న సినిమాకు సంబంధించిన వ‌సూళ్ళ లెక్క‌ల్ని మాత్రం తెర‌పైకి తీసుకురాడం ఇష్టం లేద‌ని చెప్పారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని మిగ‌తా హీరోలంతా ఎందుక‌ని తీసుకోవ‌డం లేదు అన్న‌ది అర్దం కావ‌డం లేదు. ఈ విష‌యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్‌ ఫేక్‌ లెక్కలు చెబుతోందని ‘అల వైకుంఠపురములో’ సినిమా క‌లెక్ష‌న్లు ఎక్కువ చూపిస్తున్నార‌ని అభిమానులు ఆరోపిస్తున్నారు. సేమ్‌ టు సేమ్‌, ‘అల వైకుంఠపురములో’ సినిమా వసూళ్ళ లెక్కల మీద కూడా ఇవే తరహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇక ఈ పండ‌గ స‌మ‌యంలో వ‌సూళ్ళ సినిమా ఎలా ఉన్నా కూడా వ‌సూళ్ళు మాత్రం ఢోగా ఉండ‌దు. ఈ పండ‌గ హ‌డావిడిలో రెండు సినిమాలు కాదు మ‌రో రెండు సినిమాలు వ‌చ్చినా మంచి వ‌సూళ్ళ‌నే సాధిస్తుంది. ఈ విష‌యాన్ని ఫ్యాన్స్ గ‌మ‌నించ‌కుండా ఎందుకు ఫేక్ క‌లెక్ష‌న్ల‌తో అలా చేస్తున్నారో తెలియ‌ట్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: