టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్ గా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో పొందుపర్చడం జరిగింది. అయితే తొలి రోజు తొలి ఆట నుండి మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతున్న ఈ సినిమాపై కొందరు ప్రేక్షకులు యావరేజ్ అని తేల్చేస్తున్నారు. 

 

నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు అదిరిపోయే రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేయడంతో పాటు డాన్స్ లు కూడా ఎంతో బాగా చేసారు అనే చెప్పాలి. ఇక థియేటర్స్ లో  సాంగ్స్, ఫైట్స్, విజువల్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి బాగున్నప్పటికీ కూడా సినిమా లెంగ్త్ మరీ ఎక్కువ అవడంతో పాటు దర్శకుడు అనిల్ తీసుకున్న కథను స్క్రీన్ పై సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. వాస్తవానికి తన గత సినిమాల్లో మంచి స్క్రీన్ ప్లే ని రాసుకున్న అనిల్ ఈ సినిమాని మాత్రం వాటి రేంజ్ ని అందుకునేలా తీయలేకపోయాడని అంటున్నారు. ఇకపోతే ఇప్పటివరకు మహేష్ నటించిన వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలకు కెమెరామ్యాన్ గా పనిచేసిన రత్నవేలు, 

 

ఈ మూడు సినిమాల ద్వారా మహేష్ కాంబినేషన్లో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. మహేష్ కు పెద్ద ఫ్యాన్ అయిన రత్నవేలు పనిచేసిన ఈ మూడు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో, భవిష్యత్తులో కూడా మళ్ళి అతడు మహేష్ తో పనిచేస్తే ఆ సినిమాలు కూడా ఆశించిన రేంజ్ లో హిట్ కావేమో అనే భావన కొందరు మహేష్ ఫ్యాన్స్ లో కలుగుతున్నట్లు టాక్. ఎక్కువగా సెంటిమెంట్లను నమ్మే సినిమా పరిశ్రమ వారు ఇటువంటివి ఎంతవరకు పట్టించుకుంటరో, మరి మహేష్ బాబు ఇకపై తన సినిమాలకు రత్నవేలును ఎంతవరకు తీసుకుంటారో చూడాలని అంటున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: