టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత ఒక కీలక పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. లెక్చరర్ పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. ఇన్ని సంవత్సరాల్య్ గ్యాప్ వచ్చినప్పటికి ఆవిడ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు.

 

ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి.. లేడీ అమితాబ్ విజయశాంతిలు ఒకే వేదిక మీదకు రావటంతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లి పోయింది. ఈ సందర్భంగా రాజకీయాల్లో నన్ను విజయశాంతి ఎన్ని మాటలు అన్నప్పటికి.. నేను మాత్రం తనని ఒక్క మాట కూడా అనలేదంటూ వెల్లడించటం అలా జరిగిపోయాయి. అయితే అందుకు విజయశాంతి చాలా తెలివిగా సమాధానం ఇవ్వటం అందరిలో ఆసక్తిని రేపింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికి విజయశాంతిలో హాట్ ఏ మాత్రం తగ్గలేదంటూ చిరు చేసిన సరస వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కాలంలో అంత బోల్డ్ గా విజయశాంతి అందాన్ని ఎవరూ పొగడలేదేమో? అంత సాహసం కూడా చేసే చాన్స్ లేదు. అందుకు భిన్నంగా మెగాస్టార్ చెప్పిన మాటకి విజయశాంతి ఫిదా అయ్యారని తెలుస్తోంది.

 

తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. సరిలేరు ఫంక్షన్ తో చిరుతో తనకున్న దూరం తగ్గిందని.. అపార్థాలన్నీ తొలిగిపోయాయని తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరుతో తనకు దూరం బాగా పెరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. ఒక్క ఫంక్షన్ లోనే తగ్గిపోయే దూరమైనప్పుడు.. ఇన్నేళ్లుగా ఎందుకు తగ్గించుకోలేదన్నది ఇప్పుడు అందరి మనసుల్లోను మెదులుతున్న ఆశ్చర్యకరమైన ప్రశ్న. భిన్న భావాలు ఉన్నప్పుడు వ్యతిరేకత సహజం. అయితే.. అందుకు భిన్నమైన మాటలు మాట్లాడుతున్న విజయశాంతిని చూసినప్పుడు.. రీల్ లోనే కాదు.. రియల్ లోనూ దద్దరిల్లే డైలాగులు చెప్పటం బహుషా విజయశాంతి కే సాధ్యపడుతుందేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: