సూపర్స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. భరత్ అనే నేను, మహర్షి తర్వాత మహేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచీ అందరూ ఊహిస్తూనే ఉన్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా వసూళ్లు రాబడుతున్నాయి.
కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు తెలుగు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తూ థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇటీవల వరుసగా సందేశాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న మహేష్ ఈ సినిమాతో మాస్, కామెడీ, యాక్షన్లను ట్రై చేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత మహేష్ నుంచి ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే హీరోయిన్ రష్మికకు పెద్దగా ప్రధాన్యత ఉన్న రోల్ దక్కకపోయినా.. ఉన్నంత లో గ్లామర్ పండించింది.
అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా అనిల్ తన బలమైన కామెడీని మిస్ చేయకుండా అప్పుడప్పుడూయాక్షన్ సీన్స్తో కావాల్సినప్పుడల్లా తగినమోతాదులో సెంటిమెంట్ డ్రామాతో సినిమాను ఎంగెేజింగ్గా తీశాడు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవరోజు 9.5 కోట్ల షేర్ సాధించిగా.. మూడవ రోజు 7.21 కోట్ల షేర్ సాధించి 50 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసింది.
‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 15.69 కోట్లు
సీడెడ్ – 6.49 కోట్లు
గుంటూరు – 6.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.69 కోట్లు
తూర్పు గోదావరి – 4.54 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.55 కోట్లు
కృష్ణా – 4.38 కోట్లు
నెల్లూరు – 1.81 కోట్లు
-------------------------------------------------------
మూడు రోజుల మొత్తం షేర్ – 49.31 కోట్లు
-------------------------------------------------------